చిలకలూరిపేట: ప్రజా సంఘాల ఆధ్వర్యంలో గుర్రం జాషువా విగ్రహానికి పూలమాల వేసిన నివాళులర్పించారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ చాట్రగడ్డపాడులో గుర్రం జాషువా 1895, సెప్టెంబర్ 28 న గుర్రం వీరయ్య, లింగమ్మ దంపతులకు జన్మించారని ప్రజా సంఘాల నాయకులు పేర్కొన్నారు. బుధవారం పట్టణంలోని సబ్ రిజిస్టర్ కార్యాలయం వద్ద ఉన్న గుర్రం జాషువా విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి నాయకులు మాట్లాడుతూ మూఢాచారాలతో నిండిన సమాజంలో అవమానాలు, ఛీత్కారాలు ఎదుర్కొన్నారు. జాషువా చదువుకునే రోజుల్లోనే కష్టాలు మొదలయ్యాయని,ఉపాధ్యాయులు, తోటి విద్యార్థుల నుండి ఎన్నో అవమానాలు పడ్డారు. సినిమా వాచకుడిగా పనిచేస్తూ టాకీ సినిమాలు లేని ఆ రోజుల్లో తెరపై జరుగుతున్న కథకు అనుగుణంగా సంభాషణలను చదివేవారని, తరువాత గుంటూరులోని లూథరన్ చర్చి నడుపుతున్న ఉపాధ్యాయ శిక్షణాలయంలో ఉపాధ్యాయుడిగా 10 సంవత్సరాల పాటు పాఠశాలలో తెలుగు పండితుడిగా పనిచేశారు. రెండో ప్రపంచ యుద్ధ సమయంలో మద్రాసు రేడియో కేంద్రంలో కార్యక్రమ నిర్మాతగా పనిచేసి మంచి పేరు సంపాదించుకోని అంచెలు.. అంచెలుగా ఎదిగారన్నారు.
తన పదునైన కవిత్వం ద్వారా సమాజంలోని దురాచారాలను ప్రశ్నించి ఆలోచింపజేసిన కవి గుర్రం జాషువా అని కొనియాడారు. అణగారిన ప్రజల ఆత్మగౌరవం కోసం కృషి చేశారన్నారు. తెలుగు వారికి ఎన్నో ఆణిముత్యాల్లాంటి రచనలు అందించిన కవి జాషువా, పద్మ భూషణ్, కళా ప్రపూర్ణ, కవికోకిల కేంద్ర సాహిత్య అకాడమీ, పురస్కార గ్రహీత, నవయుగ కవి చక్రవర్తి ఇలా అనేక బిరుదులు వారి సొంతం చేసుకున్నారు. వారి ఆశయాలను ముందుకు తీసుకు వెళ్ళవలసిన అవసరం ఉందన్నారు.. జీవనం కోసం ఎన్నో రకాల ఉద్యోగాలు చేసిన జాషువా 1964లో ఆంధ్రప్రదేశ్ శాసనమండలిలో సభ్యత్వం లభించింది. 1971 జూలై 24న గుంటూరులో గుర్రం జాషువా మరణించారన్నారు. ఈ కార్యక్రమంలో ఏపీ గిరిజన సంఘాల ఐక్యవేదిక రాష్ట్ర అధ్యక్షులు బి. శ్రీను నాయక్, కోశాధికారి బి.రాంబాబు నాయక్,ఏపీ ప్రవేట్ కాంపౌండర్స్, నర్సుల అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు కొండ్రముట్ల నాగేశ్వరరావు, రాష్ట్ర కార్మిక, రైతాంగ పరిరక్షణ సమితి రాష్ట్ర అధ్యక్షులు సింగు లెనిన్ బాబు, ఉపాధ్యక్షులు ప్రత్తిపాటి చిన్న, ఎమ్మార్పీఎస్ పట్టణ అధ్యక్షులు సలికినీడి నాగ రాజు గిరిజన సంఘం మండల నాయకులు మోగిలి సాంబయ్య,యం.వెంకటేష్ నాయక్ తో పాటు ఆయా సంఘాల నాయకులు పాల్గొన్నారు.

