బెంజ్ న్యూస్
ఇళ్లు లేని వారికి కేంద్ర భారీ గుడ్ న్యూస్ చెప్పింది. ప్రధాన మంత్రి ఆవాస్ యోజన పథకం కింద మరో 3 కోట్ల ఇళ్లు నిర్మించనున్నట్లు ప్రకటించింది.
పట్టణాల్లో కోటి ఇళ్ల నిర్మాణాలు చేపడతామని స్పష్టం చేసింది. ఇందుకు గాను బడ్జెట్లో అర్బన్ హౌసింగ్ కోసం రూ.2.2 లక్షల కోట్లను కేటాయించినట్లు తెలిపింది. 2024-25 వార్షిక బడ్జెట్ను పార్లమెంట్లో ప్రవేశపెట్టిన అనంతరం కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ఈ మేరకు ప్రకటించారు.